వార్తలకు తిరిగి వెళ్లండి
రూ. 30 లక్షల అభివృద్ధి పనులకు భూమిపూజ
సతీష్ కుమార్ Jun 25, 2026 12:00 PM చిత్తూరు 10 viewsabout 17 hours ago

శ్రీకాళహస్తిలోని ఎం. ఎం. వాడలో రూ. 30 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ పనులు పూర్తయితే స్థానికుల రాకపోకలు సులభతరం కావడంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయని కమిషనర్ కె.వి. కృష్ణారెడ్డి తెలిపారు.
డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం వల్ల మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా స్థానికులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి.
Comments
Loading comments...