వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ మైనారిటీ కమిషన్ కొత్త ఛైర్మన్గా హర్జీత్ సింగ్ గ్రేవాల్ ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. మైనారిటీల సంక్షేమం కోసం కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
సమస్యల పరిష్కారానికి వాస్తవాలు, డేటా ఆధారంగా ముందుకు వెళ్తామని చెప్పారు. మైనారిటీల పరిస్థితిపై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ఆధారాలతో తిప్పికొడతామని తెలిపారు.
Comments
Loading comments...

