Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భిణీలు ప్రతి నెల వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి

Follow Udayam on Google
Saychi kumar Sep 03, 2026 1:31 PM కామరెడ్డిGeneral
గర్భిణీలు ప్రతి నెల వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి - Udayam
గర్భిణీలు ప్రతి నెల వైద్య పరీక్షలు నిర్వహించుకుని మందులు వాడుతూ పౌష్టికాహారం తీసుకోవాలని మండల వైద్యాధికారి డాక్టర్ విజయ మహాలక్ష్మి అన్నారు. గురువారం నిర్వహించిన అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా ఆమె గర్భిణీలకు అవగాహన కల్పించారు. తల్లి, బిడ్డ సంరక్షణకు ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో ఉండాలని, వైద్యుల సూచనలను పాటిస్తూ, సాధారణ ప్రసవం అయ్యేందుకు గర్భిణీలకు అవగాహన కల్పించామన్నారు.

Comments

G
Loading comments...