వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం రామతీర్థం సమీపంలోని వాసవి గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరిగింది. గ్రానైట్ రాళ్లు ఒక్కసారిగా జెసిబిపై పడటంతో ఆపరేటర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న చీమకుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

