వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. స్వామివారిని పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు.
సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది.
Comments
Loading comments...
