వార్తలకు తిరిగి వెళ్లండి
వైద్య విద్యార్థుల ఫీజుల దోపిడీపై సర్కార్ నజర్

మెడికల్ కాలేజీల్లో ఐదో ఏడాది విద్యార్థుల నుండి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని తమిళనాడు మంత్రి అరుణ్రాజ్ ప్రకటించారు. శాఖాపరమైన సమీక్షా సమావేశం అనంతరం ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
మరోవైపు ఆసుపత్రుల్లో పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలు, ఆసుపత్రులపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...