వార్తలకు తిరిగి వెళ్లండి
విమానాన్ని వేలం వేసిన అధికారులు

మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చరిత్రలోనే మొదటిసారిగా ఒక విమానాన్ని (హాకర్ 800ఏ) విజయవంతంగా వేలం వేసింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీజ్ చేసిన ఈ విమానాన్ని, ఎంఎస్టీసీ ద్వారా మూడు కోట్ల రూపాయలకు విక్రయించినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.
అమర్దీప్ కుమార్, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంస్థలపై నమోదైన పీఎంఎల్ఏ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ హైదరాబాద్ జోనల్ బృందం ఈ విమానాన్ని జప్తు చేసింది.
Comments
Loading comments...