వార్తలకు తిరిగి వెళ్లండి
ఆటగాళ్లకు భారీ షాక్: డోపింగ్ చేస్తే జైలు శిక్షే

డోపింగ్ను నేరంగా పరిగణించేలా యాంటీ డోపింగ్ యాక్ట్ను సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇకపై డోపింగ్కు పాల్పడితే కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం 'నాడా' కేవలం సస్పెన్షన్లకే పరిమితమవ్వగా, కొత్త నిబంధనల ప్రకారం క్రీడాకారులతో పాటు కోచ్లు, ట్రైనర్లు, సప్లయర్ నెట్వర్క్ను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురానున్నారు.
Comments
Loading comments...