వార్తలకు తిరిగి వెళ్లండి
మత్స్యకారుల ఆచూకీపై ప్రభుత్వ నిర్లక్ష్యం : వసుపల్లి

బంగాళాఖాతంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు, బోటు డ్రైవర్ కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంపై మాజీ ఎమ్మెల్యే వసుపల్లి గణేష్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల పట్ల ప్రభుత్వానికి కనీస సానుభూతి లేదని, ఇది సామాజిక అన్యాయమని ఆయన మండిపడ్డారు.
మత్స్యకారులను తక్కువ చేసి చూస్తున్నారని, ఘటన జరిగినప్పుడు మత్స్యశాఖ మంత్రి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా విమర్శించడం మానుకుని, బాధితులకు తక్షణ న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...