వార్తలకు తిరిగి వెళ్లండి

గొలుగొండ మండలంలో వినాయక నిమజ్జనాల సందర్భంగా డీజేలు, అధిక శబ్ద సౌండ్ సిస్టమ్ల వినియోగాన్ని నిషేధించినట్లు ఎస్ఐ పీ.రామారావు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే సౌండ్ పరికరాలను స్వాధీనం చేసుకుని, సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిమజ్జనాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

