Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం చోరీపై ముమ్మర దర్యాప్తు

Follow Udayam Digital on Google
విష్ణు వర్ధన్ Jul 29, 2026 11:22 AM అనకాపల్లి ఆంధ్రప్రదేశ్
బంగారం చోరీపై ముమ్మర దర్యాప్తు - Udayam Digital
నక్కపల్లి మండలం కాగిత సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన బంగారం చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీ కెమెరా దృశ్యాలు, వేలిముద్రల ఆధారాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించి వివిధ కోణాల్లో విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. రాత్రివేళల్లో నేరాలకు పాల్పడే వ్యక్తుల వివరాలను కూడా పరిశీలిస్తూ, కేసును త్వరితగతిన ఛేదించేందుకు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...