వార్తలకు తిరిగి వెళ్లండి
పులసల జాడలేని గోదావరి

గోదావరి జిల్లాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న పులస చేపలు ఈ ఏడాది కనిపించడం లేదు. తీవ్ర వర్షాభావం మరియు నదిలో వరద నీరు తగ్గిపోవడంతో సముద్రం నుంచి చేపలు ఎదురీది రాలేకపోతున్నాయి.
జులై మూడో వారం ముగిస్తున్నా ఒక్క చేప కూడా చిక్కకపోవడంతో మత్స్యకారులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రత్యేకమైన చేపల రాక కోసం స్థానిక ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...