వార్తలకు తిరిగి వెళ్లండి

కొమురం సూరు 1918 మార్చి 25న కెరమెరి మండలం జోడేఘాట్లో జన్మించారు. గిరిజనులపై వ్యాపారులు, పట్వారులు, అటవీ అధికారుల దోపిడీ, భూ ఆక్రమణలను చిన్ననాటి నుంచే వ్యతిరేకించారు. 1938-40 మధ్య కొమురం భీం అనుచరుడిగా పనిచేశారు.
పోరాట వ్యూహకర్తగా యువకులకు ధనుస్సులు, బాణాల తయారీ, ఉచ్చులు బిగించడం నేర్పారు. 1940లో నిజాం సైనికుల దాడిలో గాయపడ్డారు. 1997 ఆగస్టు 10న ఆసిఫాబాద్ మండలం శేకన్గొంది గ్రామంలో మృతి చెందారు.
Comments
Loading comments...

