Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన గ్రామాలకు రూ.52 లక్షలతో సీసీ రోడ్డు

Follow Udayam on Google
B Ganga Aug 25, 2026 6:45 PM పార్వతీపురం మన్యంGeneral
గిరిజన గ్రామాలకు రూ.52 లక్షలతో సీసీ రోడ్డు - Udayam
సాలూరు మండలంలోని కోటుపరువు పంచాయతీ పరిధిలో గిరిజన గ్రామాల అభివృద్ధిలో భాగంగా రూ.52 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మంగళవారం శంకుస్థాపన చేశారు. రహదారి సౌకర్యంతో గిరిజనులకు విద్య, వైద్యం, ఉపాధి, మార్కెట్ సదుపాయాలు మరింత చేరువవుతాయని తెలిపారు. ప్రతీ గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

Comments

G
Loading comments...