వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరులో కొత్త పింఛన్ దరఖాస్తుల గడువు ఈ నెల 16తో ముగియనుండగా, ఐ-సెక్యూరిటీ పేపర్ల కొరత లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. పింఛన్ దరఖాస్తుకు కుల, ఆదాయ ధ్రువపత్రాలు తప్పనిసరి చేశారు.
గురువారం ఒక్కో సచివాలయానికి 10 పేపర్లు మాత్రమే అందనున్నట్లు సమాచారం. దీంతో గడువులోగా దరఖాస్తులు ఎలా చేసుకోవాలో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. తగినన్ని పేపర్లు అందించాలని అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

