వార్తలకు తిరిగి వెళ్లండి

గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో గిరిజన రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంత రోజు కావడంతో అధిక సంఖ్యలో వచ్చిన రోగులు మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సి వచ్చింది.
తీవ్ర జ్వరంతో వచ్చిన మహిళ కూడా గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో వైద్య సేవలు అందేలా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

