Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వారి అంత్యక్రియల సాయం రూ.20 వేలకు పెంపు

మనీష్ రెడ్డి Jul 18, 2026 8:43 AM అమరావతిabout 2 hours ago
వారి అంత్యక్రియల సాయం రూ.20 వేలకు పెంపు - Udayam Digital
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో పనిచేస్తూ మరణించే ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అంత్యక్రియల ఖర్చులను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మృతుల కుటుంబసభ్యులకు గతంలో ఇచ్చే రూ.15 వేల సహాయాన్ని రూ.20 వేలకు పెంచింది. ఈ మొత్తాన్ని ఆయా అర్బన్ లోకల్ బాడీల జనరల్ ఫండ్స్ నుంచే భరించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది సిబ్బంది కుటుంబాలకు ఊరట కలగనుంది.

Comments

G
Loading comments...