Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎనర్జీ డ్రింక్స్ ప్రకటనలపై ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ కొరడా

రాజేష్ కుమార్ Jul 01, 2026 1:04 PM అల్ ఇండియా 11 viewsabout 2 hours ago
ఎనర్జీ డ్రింక్స్ ప్రకటనలపై ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ కొరడా - Udayam Digital
భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) 'ఎనర్జీ డ్రింక్' లేదా అటువంటి ఉత్పత్తులకు ఎలాంటి ప్రత్యేక ప్రమాణాలను నోటిఫై చేయలేదని స్పష్టం చేసింది. ఆహార కేటగిరీ వ్యవస్థ కేవలం వర్గీకరణకే తప్ప, బ్రాండ్ల నామకరణానికి కాదని తెలిపింది. శరీరానికి, మనస్సుకు ఉత్తేజం, ఏకాగ్రత పెంపు, శక్తి స్థాయిల పెంపుదల వంటి తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనలు ఆహార చట్టం 2006 ప్రకారం నిషిద్ధమని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించే ఉత్పత్తులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...