Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ తీరప్రాంతాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక

సాయి తేజ Jul 01, 2026 12:35 PM అల్ ఇండియా 8 viewsabout 2 hours ago
ఏపీ తీరప్రాంతాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక - Udayam Digital
నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జూలై 3 నాటికి అల్పపీడనం బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రానున్న ఏడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. రాబోయే ఐదు రోజుల్లో తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు, పిడుగులు పడే ముప్పు ఉందని హెచ్చరించారు.

Comments

G
Loading comments...