వార్తలకు తిరిగి వెళ్లండి
మృత్యువులోనూ వీడని స్నేహం

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణమిత్రులు బాదావత్ తిరుపతి, కేతావత్ నరేందర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
రోడ్డు పక్కన నిలిపిన లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బాధ్యులపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.
Comments
Loading comments...