Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు ఉచితంగా విమాన ప్రయాణం: చంద్రబాబు

రవళి దేవి Jul 21, 2026 8:58 AM అమరావతిabout 8 hours ago
రైతులకు ఉచితంగా విమాన ప్రయాణం: చంద్రబాబు - Udayam Digital
ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఒకసారి ఉచితంగా విమాన ప్రయాణం కల్పించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రధాని మోదీకి ఉత్తరాంధ్ర సాంస్కృతిక నృత్యాలతో స్వాగతం పలకాలన్నారు. ప్రారంభోత్సవం రోజున ఉత్తరాంధ్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనేలా చూడాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...