వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బుద్వేల్లో చిట్టీల పేరిట భారీ మోసం వెలుగుచూసింది. బాధితుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన దంపతులు ఇంటికి తాళం వేసి కుటుంబంతో పరారైనట్లు ఆరోపణలు ఉన్నాయి.
దాదాపు రూ.5 కోట్లతో నిందితులు ఉడాయించినట్లు బాధితులు చెబుతున్నారు. అశోక్ ఇంటి వద్ద ఆందోళన చేపట్టి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...
