వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి
మనీష్ రెడ్డి Jun 25, 2026 6:28 AM నారాయణపేట 7 viewsabout 23 hours ago

మక్తల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేసేలా పకడ్బందీగా ఎస్ఐఆర్ (SIR) సర్వే నిర్వహించాలని తహసీల్దార్ సతీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం నుంచే ఈ సర్వే ప్రక్రియ ప్రారంభం కానుంది.
సర్వే మెటీరియల్ను, ఓటర్ నమోదు ఫారాలను బీఎల్ఓలకు పంపిణీ చేసిన తహసీల్దార్, డబుల్ ఓట్లను గుర్తించి వెరిఫికేషన్ చేయాలని సూచించారు. 7 మండలాల్లోని 284 పోలింగ్ స్టేషన్లలో ఈ సర్వే పారదర్శకంగా జరగాలని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...