Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూరగాయలు, పండ్ల సాగుపై దృష్టి పెట్టాలి

Follow Udayam Digital on Google
స్వాతి రెడ్డి Jul 31, 2026 5:42 PM పెద్దపల్లి తెలంగాణ
కూరగాయలు, పండ్ల సాగుపై దృష్టి పెట్టాలి - Udayam Digital
వరి, పత్తి, మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పండ్ల తోటల సాగును ప్రోత్సహించాలని ఉద్యానవన విస్తరణాధికారి బోడ్కల రాము సూచించారు. కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని పలు గ్రామాల్లో పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కూరగాయలను మల్చింగ్‌ పద్ధతిలో సాగు చేయాలని, పంట మార్పిడి పాటించాలని సూచించారు. రాయితీలు పొందేందుకు రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...