వార్తలకు తిరిగి వెళ్లండి

జరుగుమల్లి మండలం కామేపల్లిలోని శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు రంగురంగుల పూలమాలలు, విద్యుత్ దీపాలతో అమ్మవారికి విశేష అలంకరణ చేశారు.
పూలతో చేసిన ప్రత్యేక అలంకరణతో అమ్మవారి స్వరూపం నయనానందకరంగా దర్శనమిస్తోంది. విశేష అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు ఆసక్తిగా దర్శించుకుంటున్నారు.
Comments
Loading comments...

