వార్తలకు తిరిగి వెళ్లండి
హిమాచల్ను ముంచెత్తిన వానలు

హిమాచల్ ప్రదేశ్లో రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పచ్చాడ్ ప్రాంతంలో అత్యధికంగా 207 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాల ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) కీలక హెచ్చరికలు జారీ చేసింది. జూలై 15 వరకు రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంటూ అలర్ట్ ప్రకటించింది.
Comments
Loading comments...