వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తుతోంది. అధికారులు ఈ సీజన్లో తొలిసారిగా 19 క్రస్ట్ గేట్లు ఎత్తి 84,611 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
జలాశయంలో నీటి నిల్వ 86.88 శాతానికి చేరింది. ఎగువ నుంచి ఇన్ఫ్లో పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆల్మట్టి నీటి విడుదలతో ఏపీ ప్రాజెక్టులకు భారీగా నీరు చేరనుంది.
Comments
Loading comments...

