వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి ఉద్ధృతి పెరగడంతో ముమ్మిడివరం పరిధిలోని పలు లంక గ్రామాల్లోకి వరదనీరు చేరింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించగా, కొన్ని ఇళ్లను ఖాళీ చేయించి వైద్య శిబిరాలు, మరబోట్లు ఏర్పాటు చేశారు.
మరోవైపు కృష్ణా నదిలోనూ వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి భారీగా వరదనీరు చేరుతుండగా, ప్రాజెక్టు నీటిమట్టం, నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి.
Comments
Loading comments...
