వార్తలకు తిరిగి వెళ్లండి
పట్టాలెక్కనున్న తొలి హైడ్రోజన్ రైలు

భారతదేశంలో సరికొత్త రవాణా విప్లవానికి తెరలేవనుంది. దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. హరియాణాలోని జింద్, సోనిపట్ మధ్య నడిచే ఈ పర్యావరణ అనుకూల రైలులో 8 ప్యాసింజర్ కోచ్లు, 682 సీట్లు ఉంటాయి.
ఈ రైలు గరిష్టంగా 2,600 మంది ప్రయాణికులను మోసుకెళ్లగలదు. దీని వేగం గంటకు 78 నుండి 110 కిలోమీటర్లుగా ఉంటుంది.
Comments
Loading comments...