వార్తలకు తిరిగి వెళ్లండి
దేశంలోనే తొలి 'AI యూనివర్సిటీ'

బెంగళూరు గూగుల్ సదస్సులో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని ఏఐ రాజధానిగా మార్చేందుకు దేశంలోనే తొలి ప్రభుత్వ 'ఏఐ విశ్వవిద్యాలయాన్ని', ప్రత్యేక 'ఏఐ ఇన్నోవేషన్ హబ్ను' త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
పాఠశాల స్థాయి నుంచే ఏఐ విద్యను ప్రవేశపెడుతూ, గ్రీన్ డేటా సెంటర్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయం, గ్రామీణ వైద్య రంగాల్లో ఈ అధునాతన సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించనున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
Comments
Loading comments...