వార్తలకు తిరిగి వెళ్లండి

రెంజల్ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న కలపతో ఇటుక బట్టీల వద్ద బొగ్గు తయారీ జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. చెరువుల సమీపంలోని బట్టీల్లో వందల ట్రాక్టర్లలో తరలించేంత కలప నిల్వ ఉన్నట్లు సమాచారం.
అటవీ, పట్టా భూముల్లోని చెట్లను నరికి బొగ్గుగా మార్చి పట్టణాలకు తరలిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

