వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులు ఎరువుల కొనుగోలులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కాంప్లెక్స్ ఎరువులతో పాటు తప్పనిసరిగా పురుగుమందు కొనాలని కొన్ని ఫర్టిలైజర్ దుకాణాలు చెబుతున్నాయని ఆరోపించారు.
లింకు లేకుండా ఎరువులు ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులు జోక్యం చేసుకుని ఎలాంటి బలవంతపు విక్రయాలు జరగకుండా చూడాలని కోరారు.
Comments
Loading comments...

