వార్తలకు తిరిగి వెళ్లండి
రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: పవన్ కల్యాణ్

ఏరువాక పున్నమి సందర్భంగా రైతులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు, రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఆయన భరోసా ఇచ్చారు.
త్వరలో ప్రారంభం కానున్న ప్రాజెక్టుల ద్వారా రైతులకు మరింత మేలు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అన్నదాతలు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా సందేశమిచ్చారు.
Comments
Loading comments...