వార్తలకు తిరిగి వెళ్లండి

2026-27 వానాకాలం సీజన్కు డిజిటల్ క్రాప్ సర్వే ప్రారంభమైందని గణపురం వ్యవసాయ విస్తరణ అధికారి గంగారపు పవణ్ తెలిపారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి నియమించిన వాలంటీర్లు రైతుల పొలాలను సందర్శించి పంట వివరాలు, ఫొటోలను ఆన్లైన్లో నమోదు చేస్తారని పేర్కొన్నారు.
ఈ వివరాల ఆధారంగానే వరి, పత్తి తదితర పంటల కొనుగోళ్లు జరుగుతాయని తెలిపారు. సర్వేకు రైతులు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

