Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కోతలపై రైతుల రాస్తారోకో

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 22, 2026 11:08 AM నల్గొండGeneral
విద్యుత్ కోతలపై రైతుల రాస్తారోకో - Udayam
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూర్‌లో అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు సబ్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో చేపట్టారు. కరెంట్ లేక వరి నాట్లు ఎండిపోతున్నాయని, అధికారులు ఫోన్లు కూడా ఎత్తడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరారు.

Comments

G
Loading comments...