వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు శనివారం వేములవాడలో భాజపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వడ్లను రోడ్డుపై పోసి నిరసన తెలపడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
ఆందోళనకారులను నిలువరించే క్రమంలో పోలీసులు, భాజపా నేతల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం భాజపా నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఠాణాకు తరలించగా, అక్రమ అరెస్టులంటూ భాజపా నేతలు ఆరోపించారు.
Comments
Loading comments...
