వార్తలకు తిరిగి వెళ్లండి
కుప్పంలో రైతు బజార్: స్థల పరిశీలన
భవేష్ కుమార్ Jun 23, 2026 12:43 PM చిత్తూరు 3 viewsabout 2 hours ago

కుప్పంలో రైతు బజార్ ఏర్పాటుకు అధికారులు మంగళవారం స్థల పరిశీలన చేపట్టారు. కుప్పం-గుల్లేపల్లి మార్గంలోని ప్రభుత్వ స్థలాన్ని పీడీ వికాస్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం, ఎమ్మార్వో రమేశ్ బాబు పరిశీలించారు.
ప్రభుత్వం ఇప్పటికే దీనికి నిధులు మంజూరు చేయగా, త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ప్రజల సౌకర్యార్థం ఈ రైతు బజార్ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.
Comments
Loading comments...