వార్తలకు తిరిగి వెళ్లండి
వర్షాభావంతో ఆందోళనలో రైతన్నలు

ఎల్నినో ప్రభావంతో జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. చెరువులు, కుంటలు ఎండిపోతుండటం మరియు భూగర్భ జలమట్టాలు పాతాళానికి పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన వానలు లేక వరి నార్లు ముదిరిపోతుండగా, సాగు చేయాల్సిన వేల ఎకరాలు బీళ్లుగా మారాయి.
గత నెల రోజుల వ్యవధిలోనే జలమట్టం మరింతగా పడిపోవడంతో వరి సాగుపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. పంటలను కాపాడుకునే మార్గం లేక రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ స్పందన కోసం వారు ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...