Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ ప్రవాహాలపై రైతుల ఎదురుచూపులు

Follow Udayam on Google
vihar Aug 22, 2026 6:20 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఎగువ ప్రవాహాలపై రైతుల ఎదురుచూపులు - Udayam
కృష్ణా డెల్టాలో వరి సాగుచేసిన రైతులు తడుల కోసం ఎగువ నుంచి వచ్చే కృష్ణా ప్రవాహాలపై ఆశలు పెట్టుకున్నారు. పట్టిసీమ నీరు సరిపోక ఇబ్బందులు పడుతున్న రైతులు బోరుబావులు, ఆయిల్‌ ఇంజిన్లతో పొలాలకు నీరందిస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు గరిష్ఠ మట్టాలకు చేరుతుండటం, కృష్ణానదికి మళ్లీ వరద ప్రవాహాలు మొదలవడం రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది.

Comments

G
Loading comments...