Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల అకౌంట్లలోకి భారీ నగదు బదిలీ

భరత్ తేజ Jul 14, 2026 10:05 AM అమరావతి 1 viewsabout 2 hours ago
రైతుల అకౌంట్లలోకి భారీ నగదు బదిలీ - Udayam Digital
గత నెల సాంకేతిక కారణాలతో ‘మత్స్యకారుల సేవలో’ పథకం లబ్ధి పొందని ఆరు వేల మంది బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరటనిచ్చింది. వీరందరికీ రూ.20వేల చొప్పున నిధులు విడుదల చేస్తూ తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు అర్హత ఉండి ‘అన్నదాత సుఖీభవ’ నిధులు అందని రైతులు తమ సచివాలయాల్లో సంప్రదించాలని సూచించింది. అక్కడి సిబ్బంది ఈ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...