వార్తలకు తిరిగి వెళ్లండి
ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని రైతులు ఇరిగేషన్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. రిజర్వాయర్లో 17 అడుగుల నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరసనను అడ్డుకునేందుకు వచ్చిన ఎస్సై కాళ్లపై ఓ రైతు పడి, పంటలను కాపాడేందుకు నీటిని విడుదల చేయాలని వేడుకున్నారు. ఈ ఘటన అక్కడున్న వారిని కలచివేసింది.
Comments
Loading comments...

