వార్తలకు తిరిగి వెళ్లండి

కర్లపాలెం మండలం యాజలిలో సోమవారం పొలం పనులు చేస్తుండగా పాముకాటుకు గురైన రైతు కాసాని శ్రీనివాసరావు మృతి చెందాడు. కాలవ గట్లను సరిచేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.
పాముకాటుకు గురైన శ్రీనివాసరావును స్థానికులు వెంటనే వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Loading comments...

