Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృత్యువును జయించిన కుటుంబం

రూపేష్ గౌడ్ Jul 24, 2026 10:57 AM చిత్తూరుabout 2 hours ago
మృత్యువును జయించిన కుటుంబం - Udayam Digital
తిరుమల దర్శనానికి వెళ్తున్న కుటుంబానికి చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం ఎదురైంది. కుక్కలపల్లి వద్ద రెండు లారీలు ఢీకొనడంతో, అదుపుతప్పిన లారీ వీరు ప్రయాణిస్తున్న కారుపై పడి వాహనం నుజ్జయింది. అయితే కారులోని ఆరుగురు సభ్యులు అప్రమత్తమై చాకచక్యంగా బయటకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. కారు ధ్వంసమైనా, ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...