వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరు పట్టణం బృందావన కాలనీలో ఇంటి ముందు నీళ్లు పోయడంపై ఆదివారం రాత్రి రెండు కుటుంబాల మధ్య వివాదం జరిగింది. గొంగలరెడ్డి నారాయణరెడ్డి, షేక్ ఖాసిం వలీ కుటుంబాల మధ్య మాటామాటా పెరగడంతో కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు.
ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై ఇరు కుటుంబాలు గిద్దలూరు పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.
Comments
Loading comments...

