వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
నకిలీ డిగ్రీల భాగోతం: 3,000 మంది టీచర్లు తొలగింపు

నకిలీ డిగ్రీలు, ఫోర్జరీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించారనే ఆరోపణలతో 3,000 మంది ఉపాధ్యాయులను తొలగించాలని బిహార్ ప్రభుత్వం నిర్ణయించింది. 2006-2015 మధ్య జరిగిన నియామకాలపై విజిలెన్స్ బ్యూరో జరిపిన విచారణ ఆధారంగా ఈ చర్యలు చేపట్టింది.
ఇప్పటికే పలువురిపై ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, వారి వద్ద నుంచి ఇప్పటివరకు చెల్లించిన జీతాలు, గౌరవ వేతనాలను వడ్డీతో సహా రికవరీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Loading comments...