వార్తలకు తిరిగి వెళ్లండి
అయోధ్య రామమందిరం: హుండీ లెక్కింపు సిబ్బంది రాజీనామాలు

విరాళాల దుర్వినియోగం ఆరోపణలు, కఠిన తనిఖీల నేపథ్యంలో అయోధ్య రామమందిరంలో హుండీ లెక్కింపు సిబ్బంది భయందోళనకు గురై రాజీనామాలు చేస్తున్నారు. 40 మంది ఉన్న ఉద్యోగుల్లో సగానికి పైగా వైదొలగడంతో ప్రస్తుతం లెక్కింపు సిబ్బంది సంఖ్య 12కు పడిపోయింది.
దీంతో విరాళాల లెక్కింపు ప్రక్రియ ఆలస్యమవుతోంది. మరోవైపు ఈ చోరీ వ్యవహారంపై నిష్పాక్షిక దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల 13న విచారణ చేపట్టనుంది.
Comments
Loading comments...