వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లి-హుస్నాబాద్ మధ్య 22 కి.మీ ఫోర్లేన్ రహదారి నిర్మాణంలో భాగంగా చిగురుమామిడి, సుందరగిరి వద్ద బైపాస్ మార్గాల ఏర్పాటుపై అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో రహదారి విస్తరణపై స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ముల్కనూర్, చిగురుమామిడి, సుందరగిరిలో పలువురు ఇళ్లకు ప్రభావం ఉండొచ్చని సమాచారం. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు చేపడతామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
