Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సై ఉదయ్ కిరణ్ ను సన్మానించిన పోలీసులు

Follow Udayam on Google
p.g.murthy Aug 29, 2026 3:21 PM మంచిర్యాలGeneral
ఎస్సై ఉదయ్ కిరణ్ ను సన్మానించిన పోలీసులు - Udayam
రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ యూనియన్ ఎన్నికల్లో జన్నారం ఎస్సై జి. ఉదయ్ కిరణ్, లక్సెట్టిపేట్ సర్కిల్ రిప్రజెంటేటివ్‌గా ఎన్నికైన లింగన్నను పోలీస్ సిబ్బంది సన్మానించారు. శనివారం జన్నారం పోలీస్ స్టేషన్లో వారిని పోలీసు సిబ్బంది శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసుల సంక్షేమానికి అసోసియేషన్ పరంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఉన్నారు.

Comments

G
Loading comments...