వార్తలకు తిరిగి వెళ్లండి
సంగారెడ్డిలో ఈఎస్ఐ ఆస్పత్రి ప్రారంభం

సంగారెడ్డిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈఎస్ఐ ఆస్పత్రిని మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకట స్వామి గురువారం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 77 ప్రాంతాల్లో ఈఎస్ఐ ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయని, గతంలో పేరుకుపోయిన రూ.70 కోట్ల బకాయిలను చెల్లించి మెరుగైన వైద్య సేవలను ప్రజలకు అందిస్తున్నామని మంత్రులు తెలిపారు.
కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...