Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికలపై ఎంపీడీవో నటరాజు సూచన

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 10:32 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఎన్నికలపై ఎంపీడీవో నటరాజు సూచన - Udayam
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఎంపీడీవో నటరాజు కోరారు. బుధవారం కొత్తచెరువు ఎంపీడీవో కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మండలంలో 36 పోలింగ్ కేంద్రాలు, 15 గ్రామ పంచాయతీలు, 11 ఎంపీటీసీలు, 33 వేలకుపైగా ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Comments

G
Loading comments...